Lindsey Graham: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏకంగా నియంతలా పాలిస్తున్నారు. తన సిద్ధాంతాలే కరెక్టు అనుకుని, ప్రజల క్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అమెరికాను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారు. అధిక టారిఫ్లను విధిస్తూ, దేశాలమధ్య చిచ్చురేపుతున్నారు. తన నిబంధనలకు తలొగ్గని దేశాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా భారత్ను ట్రంప్ ప్రభుత్వం(Trump administration) మరోసారి హెచ్చరించింది.
భారతైపై విరుచుకుపడ్డ అమెరికా సెనేటర్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం(Senator Lindsey Graham) మరోసారి విమర్శలు చేశారు. ఈ దేశాల చర్యల వల్లే ఉక్రెయిన్లో రష్యా యుద్ధ యంత్రాంగం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మద్దతు ఇస్తున్నందుకు భారత్ ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటోందని, ఇతర దేశాలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుందని గట్టిగా వాచ్చరించారు.

రష్యా దాడిలో 23మంది ఉక్రెయిన్ పౌరులు మృతి
గురువారం ఉక్రెయిన్ లోని కీవ్ నగరంపై రష్యా జరిపిన భీకర దాడిలో 23 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే లిండ్సే గ్రాహం సామాజిక మాధ్యమం ‘ఏక్స్ వేదికగా స్పందించారు. ‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ పుతిన్ యుద్ధానికి ఊతమిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు ఇప్పుడెలా అనిపిస్తోంది? మీ కొనుగోళ్ల వల్లే పిల్లలతో సహా అమాయక పౌరులుప్రాణాలు కోల్పోతున్నారు. పుతిన్కు మద్దతిచ్చినందుకు భారత్ ఇప్పటికే మూల్యం చెల్లిస్తోంది. మిగతా దేశాలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుంది’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. లిండ్సే గ్రాహం చాలాకాలంగా రష్యా చమురు ఆదాయంపై విమర్శలు చేస్తున్నారు. ‘చమురు, గ్యాస్ ఆదాయం లేకపోతే రష్యా కుప్పకూలిపోతుంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దాని వినియోగదారులను దెబ్బతీయడమే మా ప్రధాన లక్ష్యం’ అని ఆయన గతంలో ఎన్బీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ట్రంప్ తన మాట వినడం లేదని ఏకంగా భారత్పై 50శాతం సుంకాలను విధించాడు. భారత్ మాత్రం ట్రంప్ హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ‘ మా దేశప్రయోజనాలకే మాకు ముఖ్యమని’ భారత్ ఇప్పటికే ఖరాఖండిగా బదులిచ్చింది.
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం భారత్పై ఏమన్నారు?
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల పుతిన్ యుద్ధానికి నేరుగా మద్దతు లభిస్తోందని, భారత్ ఇప్పటికే మూల్యం చెల్లిస్తోందని ఆయన విమర్శించారు.
ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఎంతమంది మృతి చెందారు?
కీవ్ నగరంపై రష్యా జరిపిన దాడిలో 23 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: