Kaleshwaram: ప్రస్తుతం రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే టాపిక్ రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే తేల్చింది. దీంతో ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అంతేకాక సీబీఐ విచారణకు బీజేపీ పార్టీ కూడా సమ్మతించింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు.

వారిద్దరిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నేడు తెలంగాణ హైకోర్టు(Telangana Highcourt) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటివరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటివరకు కమిషన్ ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఎవరిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు ఏ ప్రాజెక్టుకు సంబంధించింది?
ఈ కేసు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి సంబంధించినది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :