हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రైతుల కోసం జైలుకు పోవ‌డానికి నేను సిద్ధం – కేటీఆర్

Sudheer
రైతుల కోసం జైలుకు పోవ‌డానికి నేను సిద్ధం – కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రైతన్నల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. “ప్రజలు, రైతుల కోసం ఒకటి, రెండు సంవత్సరాలు జైల్లో ఉండేందుకు సిద్ధం” అని అన్నారు. “కాంగ్రెస్‌ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి” అని పేర్కొన్నారు.

హైద‌రాబాద్ నుంచి ఉద‌యం ఏడున్నర‌కు మొదలైన మాకు కాంగ్రెస్ పాలనలో అన్ని పనులు అస్తవ్యస్తంగాకనిపించాయి. డిచ్‌పల్లి వద్ద మహిళలు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధర్నా చేస్తున్నారు. మేము అక్కడికి చేరుకొని వారి బాధలు అడిగి తెలుసుకున్నాం. పోలీసు భార్యలుగా ఉండి కూడా పోలీసుల చేతుల్లోనే దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన వారు, రైతుబంధు ఎగ్గొట్టి, రుణమాఫీ చేయకుండా ఉన్న ఈ ప్రభుత్వం పై రైతులు కేసులు పెట్టాలి” అని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల్ని చెప్పి ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందుకు యువత కూడా కేసులు పెట్టాలి అన్నారు.

పోలీసుల‌ను కోరుతున్నా.. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఇలాంటి కిరాత‌క ప‌నులు బీఆర్ఎస్ పాల‌న‌లో చేయ‌లేదు. మంత్రినో, కంత్రినో ఫోన్ చేస్తే ఆగం కాకండి.. న్యాయం, ధ‌ర్మం ప్ర‌కారం న‌డుచుకోండి. పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో స‌హా ఇస్తాం. రేవంత్ రెడ్డి రాజు, చ‌క్ర‌వ‌ర్తి కాదు. చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి నాయ‌కుల‌తోనే కొట్లాడినం.. వీడెంత చిట్టినాయుడు.. గింతంత మ‌నిషి.. వాని చూసి ఆగం కావొద్దు అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870