हिन्दी | Epaper

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై పొన్నం ఫైర్

Vanipushpa
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై పొన్నం ఫైర్

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబ్బద్దాలు చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఉపాధి హామీకి సంబంధించి కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై ఉమ్మడి దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల చావుకు కారణం అయింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.


బీజేపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్న తాము అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని నిలదీశారు. రైతు భరోసా రూ. 12000 ఇస్తామంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాము ఇచ్చిన హామీలు క్రమ క్రమంగా అమలు చేస్తున్నామని అన్నారు.

క్రీడలకు ప్రాధాన్యం

హుస్నాబాద్‌లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ(సోమవారం) మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. పట్టణ ప్రజలతో కలిసి పలు వీధుల గుండా నడుస్తూ ఎల్లమ్మ చెరువు వరకు మార్నింగ్ వాక్ చేశారు. పిల్లలు, వృద్ధులతో ముచ్చటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని. క్రీడాకారులు తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870