हिन्दी | Epaper

గీతా కార్మికులకు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచం కిట్ ల పంపిణీ

Uday Kumar
గీతా కార్మికులకు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచం కిట్ ల పంపిణీ

చెట్టు ఎక్కినప్పుడు గీతా కార్మికులు ప్రమాదాలకు గురికాకూడదనే సదుద్దేశ్యంతో రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం లను బీసీ సంక్షేమ శాఖ రెండో విడత గా 10 వేల కాటమయ్య రక్షణ కవచం లను పంపిణీ చేస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత సంవత్సరం జులై 14 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడా లో కాటమయ్య రక్షణ కవచం లైవ్ డేమో చూసి గీతా కార్మికులకు ఈ కాటమయ్య రక్షణ కవచాలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 15 వేల మందికి ఒక్కో స్పెల్ 5 వేల కిట్స్ చొప్పున వివిధ నియోజకవర్గాల్లో తాటి చెట్టు ఎక్కి కల్లు గీసే గౌడన్న లకి శిక్షణ తరగతులు ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఇప్పుడు రెండవ విడత గా మరో 10 వేల మందికి ఈ నెల 25 వ తేది లోపు జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా ఎక్సైజ్ అధికారి సంయుక్తంగా కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ మరియు కంపెనీకి అవసరమైన గోల కమ్యూనిటీకి చెందిన అర్హతగల గౌరవ వృత్తి చేసే వారిని గుర్తించి ఈ కిట్స్ పంపిణీ చేస్తారు. ఏదైనా నియోజకవర్గంలో వృత్తిరీత్యా కల్లు గీతా కార్మికులు అందుబాటులో లేకుంటే అదే జిల్లాలోని మరొక నియోజకవర్గంలో నుండి తీసుకోవచ్చు. కాటమయ్య రక్షణ కవచాలు 18 ఏళ్ల పైబడి తాటి చెట్టు ఎక్కి కల్లుగీసే వారు మాత్రమే అర్హులు గా నిర్ధరించబడతారు.
అకాడమి ఆఫ్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ వారి శిక్షణ ఇచ్చి జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి మరియు ఎక్సైజ్ అధికారికి ఈ కిట్స్ సరఫరా చేస్తారు. దీనిని శిక్షణ పొందిన అర్హత ఉన్న వారికి వారు ఈ కాటమయ్య కిట్స్ పంపిణీ చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

📢 For Advertisement Booking: 98481 12870