యాదాద్రి భువనగిరి : (Yadadri Bhuvanagiri) కొత్త సంవత్సరాన్ని ఆధ్యాత్మికతతో స్వాగతించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్త ఏడాది తొలి రోజున స్వామివారి దర్శనం చేసుకుని శుభారంభం కావాలనే ఆకాంక్షతో భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాల బాట పట్టారు. ఆలయ ప్రాంగణాలు భక్తిశ్రద్ధలు, జయజయధ్వానాలతో సందడిగా మారాయి. ప్రత్యేకించి శ్రీ యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామి దేవాలయం, ఈ సంవత్సరంలో అంబరాన్నంటిన సంబురాలు మంత్రి పొన్నం(Minister Ponnam) యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, స్వర్ణగిరిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంల్లో తెల్లవారు జామున నుంచే భక్తుల రద్దీ కనిపించింది. స్వామివారి దర్శనం భక్తులు ఓర్పుతో నిలబడి పూజలు నిర్వహించారు.
Read also: MP Raghunandan: బిజెపి అధికారంలోకి వస్తుందని బాండ్ రాసిస్తా

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు
ఈ సందర్భంగా ఆలయాల్లో అలంకరణలు, అభిషేకాలు, హోమాలు, విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. (Yadadri Bhuvanagiri) కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా మలచుకోవాలనే ఉద్దేశంతో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు కూడా ఆలయాలను దర్శించారు. ఈ క్రమంలో యాదగిరిగుట్టలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ తో పాటు ఇతర ప్రముఖులు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్ల సక్రమ నిర్వహణ, ప్రసాద పంపిణీ, తాగునీరు, వైద్య సౌకర్యాలు, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేశారు. పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు .మొత్తంగా కొత్త ఏడాది వేడుకలు భక్తి, ఉత్సాహం, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగాయి. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలు భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: