అకౌంట్లకు శాశ్వత నిషేధం హెచ్చరిక
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో అశ్లీల కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుండటంపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లలు, యువతపై దుష్ప్రభావం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యానికి స్పందించిన ఎక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్ఫామ్లో చట్టవిరుద్ధమైన లేదా అసభ్యకర కంటెంట్ను పోస్ట్ చేసిన వెంటనే దాన్ని పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసింది.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

There will be no more room for obscene posts on X
అంతేకాదు, ఇలాంటి కంటెంట్ను పదే పదే పోస్ట్ చేసే అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. కంటెంట్ నియంత్రణ విషయంలో స్థానిక ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ విభాగం వెల్లడించింది. వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: