వెలుగుమట్ల ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు గత ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగిందని, వారిని ఇబ్బందులకు గురిచేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దశాబ్దాలుగా ఆయా స్థలాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు భరోసా కల్పిస్తూ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలంతో పాటు, పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి, పేదల సొంతింటి కలను నైతిక బాధ్యతగా నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు.
AP Liquor Case : లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్
ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేస్తూ బాధితులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పేదల సంక్షేమమేనని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భూదాన్ భూముల సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించి, పేదలకు శాశ్వత నివాస యోగ్యం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు విపక్షాల మాటలు నమ్మవద్దని, ప్రభుత్వం తీసుకునే ప్రతి అడుగు పారదర్శకంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :