హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్[Nampally Exhibition] మైదానంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బండారు దత్తాత్రేయ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
Read also :Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్?

రెండు రాష్ట్రాల అభివృద్ధి[Development] కోసం ఒకరికి మరొకరు అడ్డంకులు సృష్టించకుండా సహకార దృక్పథంతో ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యలు వచ్చినప్పుడల్లా చర్చల ద్వారా పరిష్కారాలు కనుక్కోవాలని, ప్రజల సంక్షేమం కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
అలయ్ బలయ్ వేదిక తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిబింబిస్తోందని, ఈ సంప్రదాయం సమాజంలో సమగ్రతను పెంపొందిస్తుందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆయన ఆకాంక్ష వ్యక్తం చేస్తూ, “తెలుగు ప్రజలంతా కలిసి ఉండే వాతావరణం ఏర్పడాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొని దత్తాత్రేయ కుటుంబాన్ని అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: