తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పనిచేయకపోయినా, రాష్ట్రం ధాన్య ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా అఖండ రికార్డు సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam) గర్వంగా ప్రకటించారు. ఖరీఫ్ మరియు రబీ సీజన్లను కలిపి మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం ద్వారా, ఇది దేశ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు గా నిలిచిందని వెల్లడించారు. ఈ ఘనత సాధించడంలో రైతుల కృషి, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న విధానాలు ముఖ్యపాత్ర పోషించాయని అన్నారు.
పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు నిరుపయోగమే
మాజీ ప్రభుత్వ హయాంలో రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, అలాగే రూ.10,000 కోట్లు వెచ్చించిన సీతారామ ప్రాజెక్టు లాంటి భారీ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచీ కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకూడా సాగునీటి కిందకు రాలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని తుంగలో తొక్కిన విధంగా ఈ ప్రాజెక్టులు మిగిలిపోయాయని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో భ్రమలే – క్షేత్రస్థాయిలో ఫలితాలు లేవు
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ ఖర్చులు చేసినా, వాటి ప్రభావం రైతుల జీవితాల్లో కనిపించలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రచారమే ఎక్కువ చేశారే తప్ప, వ్యవస్థాపిత సాగుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వ్యవసాయ రంగంపై దృష్టిపెట్టి, వాస్తవికంగా రైతుకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Read Also : కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!