हिन्दी | Epaper

Warangal: జిల్లా పరిధి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష

Saritha
Warangal: జిల్లా పరిధి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష

ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal) పరిధి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష పై హన్మకొండ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం (ఐడిఓసి) లోని సమావేశ మందిరం లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్ కె గృహాలు, భూ భారతి, యూరియా, ధాన్య సేకరణ, ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి మాడవీధులు, సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, వరద నివారణ పనులు తదితర అంశాలపై సమీక్షిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి, మంత్రి, రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి వర్యులు (Srinivas Reddy) శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read also: Hyderabad crime: ప్రియురాలి మృతి .. ప్రియుడు ఆత్మహత్య

Warangal

ఈ సమీక్ష సమావేశం లో ముఖ్య మంత్రి (Warangal) సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి,
కే ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ పిడి విపి.గౌతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని కలెక్టర్లు స్నేహ శబరిష్, డాక్టర్ సత్య శారద, రాహుల్, షేక్ రిజ్వాన్ బాషా, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:





గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870