हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Uttam: 8.54 లక్షల మె.ట ధాన్యం కొనుగోలు.. మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు కూడా వేగవంతం

Sushmitha
Telugu News: Uttam: 8.54 లక్షల మె.ట ధాన్యం కొనుగోలు.. మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు కూడా వేగవంతం

హైదరాబాద్: ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ఇప్పటివరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గత సంవత్సరం ఇదే రోజున కొనుగోలు చేసిన 3.94 లక్షల మెట్రిక్ టన్నుల కంటే రెండింతలు ఎక్కువ అని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam) తెలిపారు. సోమవారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో(Tummala Nageswara Rao) కలిసి ఆయన జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ దేశ చరిత్రలోనే ఒకే సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం ఒక చరిత్ర సృష్టించడమని మంత్రి పేర్కొన్నారు.

Read also: Tirupati: ఎఫ్ఐఆర్ తరువాత నిందితుడిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి?

Uttam
Uttam

కొనుగోళ్ల వివరాలు, రైతుల చెల్లింపులు

ఇప్పటివరకు 3.95 లక్షల మె.ట సన్నాలు, 4.59 లక్షల మె.ట దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం రూ. 2,041.44 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా, గత ఏడాది కంటే ఇది రెట్టింపు. ఇందులో రూ. 832.90 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని కొనుగోళ్లు నమోదు తర్వాత 48 గంటల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. సన్నాల బోనస్ కూడా గత ఏడాదితో పోలిస్తే ₹43.02 కోట్ల నుంచి ఈ సంవత్సరం ₹197.73 కోట్లకు పెరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్లు కనీస మద్దతు ధర (MSP), బోనస్ రైతులకు వెంటనే చెల్లించేలా పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రక్షించడానికి తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచి, మిల్స్‌కు వెంటనే తరలించాలని ఆదేశించారు.

పత్తి, మొక్కజొన్న సమస్యలు, కేంద్రానికి విజ్ఞప్తి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి, మొక్కజొన్న,(corn) సోయాబీన్ కొనుగోళ్లపై కలెక్టర్లతో చర్చించారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు కొనుగోలు పరిమితిని 18.5 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై సంతృప్తిగా ఉన్నారని కలెక్టర్లు తెలిపారు. అయితే, పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ (CCI) నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు వివరించారు. దీనిపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు, పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వర్షాల కారణంగా రంగు మారిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతించాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించామని తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా సుమారు 1.10 లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.

కీలకమైన నవంబర్ నెల, సమన్వయ కృషి

సమీక్ష ముగింపు సందర్భంగా ఇద్దరు మంత్రులు నవంబర్ నెలను పంటల కొనుగోళ్లకు అత్యంత కీలకమైన నెలగా పేర్కొన్నారు. తదుపరి నాలుగు వారాల్లో మొత్తం ధాన్యం కొనుగోళ్లలో 55 శాతం జరగనుందని, అందువల్ల అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి రాష్ట్ర లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ప్రతి గింజ, చెల్లించిన ప్రతి రూపాయి రైతుల పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

రేవంత్ రెడ్డికి జైలు శిక్ష తప్పదు

📢 For Advertisement Booking: 98481 12870