తెలంగాణ (TG) రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యలో పెరుగుదలతో పాటు, అగ్రిగేట్గా మెడికల్ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ, మెడికల్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. (TG) ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మొదటి, రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కూడా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుందని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
Read Also: Telangana: నేడు రాష్ట్రవ్యాప్తంగా వరదలు, ప్రమాదాలపై మాక్ ఎక్సర్ సైజ్

నైపుణ్యాలను కూడా పెంపొందించాలని నిర్ణయించింది
చాలామంది గ్రామీణ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులతో మెడికల్ సీట్లు పొందుతున్నప్పటికీ.. తరగతి గదిలోకి వెళ్లగానే ఇంగ్లీష్ మీడియం బోధన, సంక్లిష్టమైన మెడికల్ టెర్మినాలజీ చూసి ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో వారు పాఠాలు అర్థం కాక లోన్సీగా ఫీల్ అవుతున్నారు. కొందరు చదువును మధ్యలోనే ఆపేయటం, మరికొందరు పరీక్షల్లో వెనుకబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం దీనిని పరిష్కరించేందుకు భాషా నైపుణ్యాలను కూడా పెంపొందించాలని నిర్ణయించింది. గ్రామీణ విద్యార్థుల్లో నైతిక ధైర్యాన్ని నింపటమే దీని వెనుక లక్ష్యంగా ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోద రాజవర్సింహ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: