हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: TG: తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

Rajitha
News Telugu: TG: తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినా, అది పూర్తిగా ఫ్లాప్ అయ్యిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao) తీవ్రంగా ఆరోపించారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టినా, సమ్మిట్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం, లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక కనిపించకపోవడం పెద్ద లోపమని హరీశ్ రావు విమర్శించారు. దానిని ‘విజన్‌లేని డాక్యుమెంట్’గా అభివర్ణించారు.

Read also: Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

Revanth Reddy

Revanth Reddy is a thief who is looting Telangana

హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు

“క్యూర్, ప్యూర్, రేర్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి… అసలు తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ లా మారిపోయాడు” అని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో జరిగిన ఒప్పందాల వెనుక చీకటి లావాదేవీలు ఉన్నాయని, అంకెల గారడీ తప్ప వాస్తవ ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

రెండేళ్లుగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, సమ్మిట్‌లు నిర్వహిస్తూనే ఉన్నా

• రాష్ట్రానికి వచ్చిన అసలు పెట్టుబడులు ఎన్ని?
• క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు ఎన్ని?
• యువతకు లభించిన ఉద్యోగాలు ఎన్ని?

అన్న వివరాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని హరీశ్ రావు ప్రభుత్వం మీద సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిని అదే గ్లోబల్ సమ్మిట్ వేదికగా బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ మరియు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారని హరీశ్ రావు గుర్తు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870