తెలంగాణను స్టార్టప్లకు కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో(TG) యూనికార్న్ కంపెనీలుగా ఎదిగే స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. స్టార్టప్లను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ₹1,000 కోట్ల భారీ స్టార్టప్ ఫండ్ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ టీ-హబ్లో నిర్వహించిన గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఈ ఫండ్తో రాష్ట్ర స్టార్టప్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. స్టార్టప్లు విజయవంతం కావాలంటే సమిష్టి కృషి, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. ఫుట్బాల్ ఉదాహరణ ఇస్తూ… జట్టు భావన, పట్టుదలతో పనిచేసినప్పుడు విజయం సాధ్యమవుతుందని, అదే తత్వం స్టార్టప్లకు కూడా వర్తిస్తుందని చెప్పారు. గూగుల్ కంపెనీ ఎలా ఒక చిన్న గ్యారేజీ నుంచి ప్రపంచ దిగ్గజంగా ఎదిగిందో గుర్తు చేస్తూ, తెలంగాణ యువత కూడా పెద్ద కలలు కనాలని, వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
Read also: సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

టీ-హబ్, ఇన్క్యుబేటర్లు అంతర్జాతీయ పెట్టుబడులకు వేదిక
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,(TG) టీ-హబ్, ఇతర ఇన్క్యుబేటర్లను మరింత అభివృద్ధి చేసి, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించే ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడం కూడా ఈ లక్ష్యానికే భాగమని చెప్పారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దొరికిందని అన్నారు. భవిష్యత్తులో యువతకు భారీ అవకాశాలు లభించేలా పథకాలను అమలు చేస్తామని, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాలు తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తాయని సీఎం తెలిపారు. ఇదే సందర్భంలో, గ్లోబల్ సమ్మిట్పై పూర్తి నివేదికను అందజేయడానికి తాను ఢిల్లీకి వెళ్లనున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: