हिन्दी | Epaper

TG: విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

Saritha
TG: విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

హైదరాబాద్ : (TG) ఏడాదిన్నరగా ఆపరిష్కతంగా వున్న తమ డిమాండల్ల సాధనకు విశ్రాంత ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన విశ్రాంత ఉద్యోగులు తమకు ప్రభుత్వం (Government) నుంచి రావలసిన బకాయిల కోసం కదం తొక్కారు. పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు నాంపల్లి, బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీ వైపుకు వచ్చెందుకు యత్పంచగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు బలవతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారు.

Read also: Jogu Ramanna arrest : రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

TG: విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

తమను అరెస్టు చేస్తున్న(TG) సమయంలో విశ్రాంత ఉద్యోగులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ అరెస్టు అన్యాయమని, సర్కారు తమ ను మోసం చేసిందని వాపోయారు. 30 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పనిచేసిన వారు పదవీ విరమణ చేశాక న్యాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇచ్చేందుకు సర్కారు నిరాకరణ దారుణమని తెలిపారు. ఏడాదిన్నరగా దీనిపై అనేక రూపాలో పోరాటం ప్రభుత్వంలో చేసినా చలనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.

అనేక మంది విశ్రాంత ఉద్యోగులు అనారోగ్యం పాలైతే వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారని, ఇందులో కొందరు చనిపోయారని ఆయన తెలిపారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని ఇప్పటికైనా విడనాడి, తమకు రావాలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల విషయంలో సర్కారు ఇదే విధం గా నిర్లక్ష్యం కొనసాగిస్తే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆందోళనకారులను పలు పోలీసు స్టేషన్లకు తరలించి రాత్రి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870