Telugu News: TG: భద్రం.. పథకాల పేరిట సైబర్ మోసాలు పోలీసుల హెచ్చరిక

Read Time:  1 min
Telugu News: TG: భద్రం.. పథకాల పేరిట సైబర్ మోసాలు పోలీసుల హెచ్చరిక
FONT SIZE
GET APP

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల(Cyber ​​fraud) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ(Telangana) పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ గ్రూపులలో వచ్చే సందేశాలను చూసి మోసపోవద్దని, అర్హత కోసం లింక్స్‌లపై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని సూచించారు.

Read Also: Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్యం అహ్మదాబాద్‌కే: జైశంకర్

TG

సైబర్ నేరగాళ్ల వ్యూహం

వాట్సాప్ గ్రూపులలో(WhatsApp) సైబర్ నేరగాళ్లు ఫేక్ లింక్స్‌లను పంపి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలను నమ్మబలుకుతారని పోలీసులు పేర్కొన్నారు. అర్హతను పరిశీలించుకోవాలని ఆశ చూపుతూ లింక్‌లను పంపుతారని, వాటిపై తొందరపడి క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అపరిచితులు పంపించే లింక్స్, సందేశాలకు స్పందించవద్దని సూచించారు.

అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించండి

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారం కోసమైనా అధికారిక వెబ్‌సైట్‌లను(Website) మాత్రమే సంప్రదించాలని, అనధికారిక లింక్స్‌ను నమ్మవద్దని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర పథకాల విషయంలో పోలీసులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నందున పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ద్వారా వచ్చే లింక్స్‌పై క్లిక్ చేయవచ్చా?

లేదు, అపరిచితులు పంపే ఫేక్ లింక్స్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని పోలీసులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.