हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Latest news: TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి

Saritha
Latest news: TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిజెఎస్ మద్దతు కోరిన మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ(TG)ఆవిర్భావంలో కోదండరాం(Kodandaram) పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని, నిస్వార్ధంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాల యంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటి అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిజెఎస్ మద్దతుపై చర్చించారు. ఈ సందర్భంగా టిపిసిసి చీఫ్ మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు తెలుసుననన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ నిరంకుశ పాలన విముక్తి కోసం 2023లో మేమెంత కలిసి పోరాడామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి రావడానికి వారి సహకారం మరచి పోమని, ఉద్యోగ నియామక రూప కల్పనలో కోదండరాం సలహాలు సూచనలు విలువైనవని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అను గుణంగా ప్రజా పాలన సాగుతుందన్నారు. జూబ్లి హిల్స్ ఎన్నికలో మద్దతు కోరినట్లు తెలిపారు. యువకుడైన నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీల మాదిరిగానే టిజెఎస్ మద్దతు కోరినట్లు తెలిపారు.

Read also: OpenAI సీఈఓ ప్రకటనతో కుప్పకూలిన ఆల్ఫాబెట్ షేర్లు

TG
TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి

బిజెపి మతవాద రాజకీయాలను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్

కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రికి స్థాయి వ్యక్తి నోటికొచ్చింది మాట్లాడటం విచారకరం అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ రాజేసి లబ్ది పొందాలని బిజెపి నేతల వన్నాగం చేస్తున్నారని అన్నారు. జూబ్లిహిల్స్(TG) ఉప ఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మిత్ర పక్షాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మిత్రపక్షంగా టిజెఎస్ పార్టీకి ఇచ్చిన హామీ మేరకు ప్రభు త్వంలో తగిన భాగస్వామ్యం కల్పించాలని, రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పలుచోట్ల టిజెఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బిసి రిజర్వేషన్ల సాధన కోసం తీవ్రం గా కృషి చేయాలని, ఆ ప్రయత్నానికి టిజెఎస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో టిజెఎస్ రాష్ట్ర కమిటీసమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు గొప్పగాని శంకర్రావు, పల్లెవినయ్, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, నాయకులు మాసంపల్లి ఆరుణ్ కుమార్, సర్దార్జస్వంత్, బట్టల రామ చందర్, కొత్తరవి, ప్రశాంత్, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870