వేసవిలో ఎక్కువ మంది ఏసీ ఉన్న గదిలోనే సమయం గడుపుతుంటారు. పిల్లలకు వేరే గదిలో ఏసీ పెట్టాలనుకునేవారు, కరెంట్ బిల్లు పెరుగుతుందా అనే ఆలోచనతో వెనక్కి తగ్గిపోతారు. అలాంటి కుటుంబాలకు “ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన” పథకం పెద్ద ఉపశమనం. ఈ పథకం కింద ఇంటి పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే, ఇంటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకుని వాడుకోవచ్చు. అదనంగా, మిగిలిన విద్యుత్ను grid కి అమ్మి ఆదాయం కూడా సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం రూ.78,000 వరకు సబ్సిడీ ఇస్తోంది.
Read also: TG Drone Show:గ్లోబల్ సమ్మిట్లో చారిత్రక ఘట్టం: డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డు నమోదు

ఈ పథకం ద్వారా
- విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది.
- సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటం తగ్గుతుంది.
- పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది.
- డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2027 నాటికి ఒక కోటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యం. ప్రతి సంవత్సరం రూ.75,000 కోట్ల వరకు ఆదా లభిస్తుందని అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: