హైదరాబాద్: సినిమా హీరోలను జైలులో పెట్టిన తెలంగాణ(TG) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,(Revanth Reddy) ఇప్పుడు సినీ పరిశ్రమలోని కార్మికులకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: RBI: ప్రపంచస్థాయి బ్యాంకులకు సిద్ధమవుతున్న భారత్: నిర్మలా సీతారామన్

జూబ్లీహిల్స్ ఎన్నిక, ప్రభుత్వ పాలనపై విమర్శలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, రాష్ట్ర ప్రజలు మూడేళ్ల పాటు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు. వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు ఏది కావాలో తేల్చుకోవాలని కోరారు.
- నిర్లక్ష్యం: రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, కాంగ్రెస్ పాలనలో కేవలం నలుగురు సోదరులు మాత్రమే సంతోషంగా ఉన్నారని విమర్శించారు.
- హామీలు: ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను రేవంత్ రెడ్డి విస్మరించారని ధ్వజమెత్తారు.
- బ్లాక్మెయిలింగ్ ఆరోపణలు: కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయకుంటే రేషన్ కార్డులు ఆగిపోతాయని, పెన్షన్ పెరగదని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి జూబ్లీహిల్స్లో ఓట్లు వేయించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ తీరుపై ప్రశ్నల వర్షం
కంటోన్మెంట్లో 6 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని హరీశ్ రావు నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని విమర్శించారు. రెండేళ్లుగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వని కాంగ్రెస్, జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయని ఇప్పుడిచ్చిందని ఆరోపించారు. పీజేఆర్ మీద కాంగ్రెస్ పార్టీకి అంతగా అభిమానం ఉంటే 2023లో పీజేఆర్ కుమారుడికి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: