హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీల్లో జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టర్ పదవులు, కీలక శాఖల కమిషనర్ పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్ డైరెక్టర్ గా ఉన్న జి. శ్రీజననుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (కూకట్పల్లి, శేర్ లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) అదనపు కమిషనర్ బదిలీ చేశారు. నిజామాబాద్ కలెక్టర్గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని జిహెచ్ఎంసీ (మల్కాజ్గరి, ఎల్బీనగర్, ఉప్పల్న్లు)లో అదనపు కమిషనర్ బదిలీ అయ్యారు. హైదరాబాద్ నగర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధం, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో వీరి పాత్ర కీలకంగా ఉండనుంది.
Plastic Ban: హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్

TG IAS Officers
వుమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉన్న శృతి ఓజాకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణ, గ్రామస్థాయి పరిపాలన బలోపేతం దిశగా ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ను నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బదిలీ చేశారు. నల్గొండ జిల్లాలో సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక నారాయణపేట జిల్లాలో అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ ను నియమించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: