हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: TG Colleges – ఈనెల 15 నుంచి కాలేజీలు బంద్..కారణమిదే?

Anusha
Latest News: TG Colleges – ఈనెల 15 నుంచి కాలేజీలు బంద్..కారణమిదే?

తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం మరోసారి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్లక్ష్య ధోరణిపై నిరసనగా ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్‌ తదితర వృత్తి విద్యా కళాశాలలు ఈ బంద్‌లో భాగమవుతున్నట్లు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ (Federation of Higher Education Institutions) స్పష్టంచేసింది.

ప్రధాన కారణం ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు (Fee reimbursement funds) పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉండటమే. ఫెడరేషన్ నేతల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు మరియు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ నిధులు విడుదల కాకపోవడంతో అనేక కాలేజీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సిబ్బందికి వేతనాలు చెల్లించే స్థోమత కూడా లేకపోవడం వల్ల యాజమాన్యాలు బంద్ తప్ప వేరే మార్గం లేదని అంటున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే

ఇటీవలే ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ (Chairman of the Telangana Council of Higher Education) కు వినతిపత్రం సమర్పించారు. అందులో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యాసంస్థల నిర్వహణ అసాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో బంద్ ప్రకటించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల చదువుపై నేరుగా ప్రభావం పడనుంది. పరీక్షలు, తరగతులు, ఇంటర్న్‌షిప్‌లు వంటి అంశాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

Nirmala Sitharaman
Nirmala Sitharaman

ప్రభుత్వం నుంచి వృత్తి విద్యా కాలేజీలకు, వాటిలో చదివే విద్యార్థులకు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ కలిపి మొత్తంగా రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వెంటనే ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే తెలంగాణ విద్యా రంగం (Education sector of Telangana) తీవ్రంగా దెబ్బతింటుందని.. కళాశాలల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొన్నారు.మరోవైపు.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని.. గత కొంతకాలంగా విద్యార్థులు,

రాష్ట్ర ప్రభుత్వం స్పందించ‌క‌పోవ‌డంతోనే నిరవధిక బంద్‌

విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్ వెంట‌నే రిలీజ్ చేయాల‌ని ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని.. అయితే వాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించ‌క‌పోవ‌డంతోనే నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేయ‌నందుకు నిర‌స‌న‌గా సెప్టెంబర్ 15వ తేదీ ఇంజినీర్స్ డేను బ్లాక్‌డేగా పాటిస్తామ‌ని ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాలు ప్రక‌టించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-telangana-facial-recognition-implemented-for-attendance-of-degree-and-pg-students-full-details/telangana/546149/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాంగ్రెస్ VS బీజేపీ – ‘రూ.100 కోట్లకు మేయర్ సీటు’

కాంగ్రెస్ VS బీజేపీ – ‘రూ.100 కోట్లకు మేయర్ సీటు’

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా ? బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

ప్రచారం అదిరింది..ఫలితాలు ఎవరికీ వస్తాయో ?

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారేమో.. KTRకు రేవంత్ కౌంటర్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

బిఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడగాలి – రేవంత్

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే – అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరగాలి: కలెక్టర్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

ఈ నెల 11 వరకు వైన్స్, బార్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870