हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: TG: యాసంగిలో 68.67 లక్షల ఎకరాల సాగు

Sushmitha
Telugu News: TG: యాసంగిలో 68.67 లక్షల ఎకరాల సాగు

అత్యధికంగా 51.48 లక్షల ఎకరాల్లో వరి

వ్యవసాయ శాఖ ప్రణాళిక

హైదరాబాద్: తెలంగాణ(TG) రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 68.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నారు. అయితే, గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం 16.50 లక్షల ఎకరాలు తగ్గడం విశేషం. రాష్ట్రంలోని వాతావరణ(weather) పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటి వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ శాఖ ఈ రబీ సీజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

Read Also: AP SSC : టెన్త్ పరీక్షల ఫీజుల చెల్లింపు తుది గడవు 25

TG
TG

వరి సాగుకు అత్యధిక ప్రాధాన్యత

యాసంగిలో సాగు చేసే మొత్తం విస్తీర్ణంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ప్రధానంగా వరికి అత్యంత ప్రాధాన్యత కల్పించింది.

  • వరి: 51.48 లక్షల ఎకరాలు
  • మొక్కజొన్న: 6.45 లక్షల ఎకరాలు
  • శనగలు: 3.04 లక్షల ఎకరాలు
  • వేరుశెనగ: 2.60 లక్షల ఎకరాల్లో వేసే అవకాశం ఉందని ప్రణాళికలో పేర్కొంది.

గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్‌లో వ్యవసాయ శాఖ 47.27 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారని అంచనా వేయగా, అంతకన్నా దాదాపు 15.50 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు జరిగింది. ఇందులో ఒక్క వరియే 12.5 లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు వేశారు.

ఎరువుల కేటాయింపులు

ఈ సీజన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 20.10 లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది.

  • యూరియా: 10.40 లక్షల టన్నులు మంజూరు చేసింది. గత యాసంగి సీజన్‌లో రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా మాత్రమే కేటాయించగా, ఈసారి 60 వేల టన్నులు అదనంగా కేటాయించడం విశేషం.
  • ఇతర ఎరువులు: 1.45 లక్షల టన్నుల డ్రై అమ్మోనియమ్ ఫాస్పేట్, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్, 65 వేల టన్నుల మ్యూరో ఆఫ్ పొటాష్, 60 లక్షల టన్నుల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను కూడా కేటాయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870