Gold Loan Fraud- పల్నాడు జిల్లా మంగళరిగిలోని(Mangalagiri) లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ బంగారం తాకట్టు విడిపించే సేవలతో గుర్తింపు పొందింది. యజమానులు డబ్బులు చెల్లించిన తర్వాతే బంగారం తిరిగి ఇవ్వడం ఈ సంస్థ పద్ధతి. ఈ ట్రేడర్స్లో గుమాస్తాగా పనిచేస్తున్న మహేష్ బాబు, ఇతర ఉద్యోగులు కర్నె రాము, మహిమ క్రాంతి సహా కొంతమంది పని చేస్తున్నారు. ఇదే సంస్థలో పనిచేస్తున్న కర్నె రాము, ట్రేడర్స్ యజమానిని మోసం చేయడానికి ఒక పథకం రచించాడు. మహిమ క్రాంతి భార్య రాధికతో యజమానికి కాల్ చేయించి, మాచర్ల ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న 62 గ్రాముల బంగారం విడిపించాలని చెప్పించాడు. దీంతో యజమాని, మహేష్కు 5 లక్షల రూపాయలు ఇచ్చి బంగారం తీసుకురావాలని ఆదేశించాడు.
గుమాస్తాపై కారుతో ఢీ, డబ్బులు లూటీ

డబ్బులు తీసుకున్న మహేష్ మాచర్లకు బయలుదేరాడు. అయితే రాము, మహిమ క్రాంతి ముందే ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యారు. ఫ్లైఓవర్ వద్దకు రమ్మని మహేష్ను పిలిపించారు. అక్కడికి వెళ్లగానే వారి కారు, మహేష్ బైక్ను ఢీకొట్టి అతనిపై దాడి చేశారు. అనంతరం 5 లక్షల రూపాయలు దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ(Camera Photage), ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి 5 లక్షల నగదు, రెండు కార్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు.
లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్లో ఏం జరుగుతుంది?
వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి, యజమానులు డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి ఇస్తుంది.
దోపిడీ ఎలా జరిగింది?
5 లక్షల రూపాయల నగదు తీసుకుని వెళ్లిన గుమాస్తాపై కారు ఢీ కొట్టి దాడి చేసి డబ్బులు లూటీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: