Telangana weather : మార్చి నెల ప్రారంభం నుంచే తెలంగాణలో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కొంత ఊరట ఇచ్చే సమాచారం వెల్లడించింది.
మార్చి 15 నుంచి వర్షాలు
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మార్చి 14 వరకు ఎండలు కొనసాగుతాయి. అయితే మార్చి 15 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముందుగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఈదురుగాలులతో వడగళ్ల వాన
మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
Read Also: Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

జిల్లాలకు ఎల్లో అలెర్ట్
వర్షాల నేపథ్యంలో కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కొంత తగ్గి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ అకాల వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: