తెలంగాణ (Telangana) లో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టు నుంచి ఊరట లభించింది. గ్రూప్ -1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు.
Read Also: Telangana: పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు

562 మంది అభ్యర్థులకు ఊరట
విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో గ్రూప్ – 1 ఉద్యోగాలకు ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ఊరట లభించింది. 2024 లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో మొత్తం 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు 2025 సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: