Amrutha Pranay Case: అమృత ప్రణయ్ పరువు హత్య కేసు(Honor killing case)లో తెలంగాణ(Telangana) హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో, గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు.
Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అతని వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రవణ్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. తనకు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టు(High Court)లో అప్పిల్ దాఖలు చేయగా ఏఐపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిట్ రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, మరో రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
కేసు పూర్వాపరాలు..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా 2018 సెప్టెంబర్ 14 న ఓ దుండగుడు మాటువేసి ప్రణయ్ ను హతమార్చాడు. అపనపట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకు కారణం కులాంతర వివాహమేనని, అతని భార్య అమృత తంనరడి తిరునగరి మారుతీరావు ఈ హత్య చేయించాడని నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు మారుతీరావు, ఇతరులను అరెస్టు చేశారు. 2019లో బెయిల్ పై బయటకు వచ్చిన మారుతిరావు హైదరాబాద్లో ఓ హోటల్ గదిలో 2020 మార్చి 8న విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్టు హంతకుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, శ్రవణ్ కుమార్ కు జీవితఖైదు విధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: