తెలంగాణ (Telangana) రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న వివిధ ముఖ్యమైన కార్యక్రమాలు — క్రికెట్ మ్యాచ్లు, మారథాన్ పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్, సినిమాల ప్రీమియర్ షోలు మొదలైన వాటికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. నగరం వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా మారుతుండటంతో, జన సమ్మర్దం అనివార్యంగా మారుతోంది. అయితే, ఇటువంటి రద్దీ పరిస్థితుల్లో అణచలేని ప్రమాదం ఒకటి — తొక్కిసలాట (Stampede).

తొక్కిసలాటల తీవ్రతను చాటిన గత ఘటనలు
గతంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలు, ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఎలాంటి విపత్తులు సంభవించవచ్చో ఘాటుగా గుర్తుచేశాయి. ఉదాహరణకు, 2022లో జింఖానా మైదానంలో ఐపీఎల్ టికెట్ల కోసం వేలాది మంది గుమిగూడగా, భద్రతా ఏర్పాట్లలో లోపాల వల్ల భయానక తొక్కిసలాట జరిగింది. ఇటీవల బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం వేళ అక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో హైదరాబాద్ జింఖానా మైదానంలో ఐపీఎల్ టిక్కెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఇటీవల ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో ఓ సినిమా విడుదల సందర్భంగా అభిమానులను అదుపు చేయటం పోలీసులకు సైతం విఫలమయ్యారు. క్రికెట్ పోటీలు జరిగినప్పుడు ఉప్పల్ స్టేడియంతో పాటు ఆ ప్రాంతంలోని ఐదారు కిలోమీటర్ల వరకూ మార్గాలు కిక్కిరిసిపోతుంటాయి.
గూగుల్ తో జతకట్టిన హైదరాబాద్ పోలీస్ విభాగం
ఈ తరహా ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Commissioner CV Anand) నేతృత్వంలో, పోలీస్ శాఖ గూగుల్ సంస్థతో కలిసి ఒక సాంకేతిక సహకార వ్యూహాన్ని రూపొందించింది. జనం రద్దీని ముందుగానే గుర్తించేందుకు సిద్ధమయ్యారు. గూగుల్ సహకారంతో కార్యక్రమాలుకు హాజరయ్యే వారి సంఖ్య ఎంత ఉంటుందనే సమాచారాన్ని అంచనా వేయనున్నారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రజలు గూగుల్మ్యాప్స్ సాయంతో గమ్యాలకు చేరుతున్నారు. ఈ గణాంకాలను విశ్లేషించి ఏయే రోజుల్లో ఎటువైపు ఎక్కువమంది రాకపోకలు సాగిస్తారు. ఏయే ప్రదేశాల్లో జనం చేరబోతున్నారనే వివరాలను గూగుల్ నుంచి ముందుగానే పోలీసులు తీసుకుంటారు. వాటిని విశ్లేషించి వారు ఏయే మార్గాల్లో ప్రయాణిస్తారనే దానిపై అంచనాకు వస్తారు.
సాంకేతికత ఆధారిత భద్రతా వ్యూహం
ఈ వ్యూహం కేవలం గూగుల్ డేటాపైనే ఆధారపడటం కాదు. పోలీస్ శాఖ ఇప్పటికే డ్రోన్లను, సీసీటీవీలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్రౌడ్ మానిటరింగ్ టూల్స్ను కలిపి ఉపయోగిస్తోంది.
దాని ఆధారంగా ఆ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. జన సమ్మర్థ ప్రదేశాలు, కార్యక్రమాలకు తగినట్టుగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపుతారు. ఎటువంటి తోపులాట, తొక్కిసలాట జరగకుండా ముందుగానే నిర్వాహకులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రయోగం ఆచరణలోకి తీసుకొస్తే తొక్కిసలాటకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Congress Leader Murder: నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య