News Telugu: Telangana: అడ్లూరి వ్యాఖ్యలపై స్పదించను: పొన్నం ప్రభాకర్

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం Minister Ponnam ప్రభాకర్ తేలికగా స్పందించారు. ఇటీవల జరిగిన రహ్మత్‌నగర్ సమావేశం తర్వాత మంత్రుల మధ్య విభేదాల వార్తలు వెలువడిన నేపథ్యంలో పొన్నం స్పష్టత ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ Mahesh Kumar గౌడ్‌తో తనకు చర్చ జరిగిందని, ఆయన సూచనలు తానే అనుసరిస్తానని పొన్నం తెలిపారు. “పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్షుడు ఇచ్చిన మార్గదర్శకత్వాన్నే నేను పాటిస్తాను” అని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ Adluru Laxman చేసిన వ్యాఖ్యలపై తాను ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వనని ఆయన స్పష్టం చేశారు.

Lilly: మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు.. ముందుకొచ్చిన ఎలి లిల్లీ

Telangana

Telangana

ఇక, ఈ వివాదంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్‌తో మాట్లాడి, ఇరువురు నేతలు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఇక మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, “పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు” అని వ్యాఖ్యానించారు. పొన్నం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే దాని ఫలితాలు ఆయనే ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ లోపలి విభేదాలపై రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, పరిస్థితిని సర్దుబాటు చేసే దిశగా పీసీసీ చీఫ్ చర్యలు ప్రారంభించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ ఎలా స్పందించారు?
స్పందించబోనని, పీసీసీ చీఫ్ ఆదేశాలే తుది అని తెలిపారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఏం చేశారు?
ఇద్దరితో మాట్లాడి, సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.