సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లగా, రూ.564 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నిధులు విడుదలైతే రాష్ట్రంలోని పెండింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.
Read Also: Jagtial Municipality : జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై తెరపడిన ఉత్కంఠ

రాష్ట్రవ్యాప్తంగా(Telangana) మొత్తం 1.45 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు 60 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మరో 30 వేల ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే నిధుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో పనులు మందగించాయి.
కేంద్రం నుంచి నిధులు విడుదలైతే పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో లక్షలాది పేద కుటుంబాలకు(Telangana) స్వంత ఇంటి కల నెరవేరనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ పేదలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించగా, నిర్మాణ పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది. త్వరలోనే మరిన్ని ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: