हिन्दी | Epaper

Telangana: 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్

Anusha
Telangana: 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్

మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలకమైన,నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో మహిళలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ వయసున్న బాలికలు రాష్ట్రంలో 4 .60 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వ్యాక్సినేషన్ చేపట్టడానికి ముందు మైక్రో ప్లానింగ్ సర్వే నిర్వహించనున్నారు.

Read Also: Municipal elections results : కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?

సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు

దీని ద్వారా ఈ వయసున్న అమ్మాయిలు స్కూళ్లలో ఎంత మంది ఉన్నారు, బయట ఎంత మంది ఉన్నారనే వివరాలను సమగ్రంగా సేకరిస్తారు.తెలంగాణలోని క్యాన్సర్ కేసులను పరిశీలిస్తే.. మహిళల్లో ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంది. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలకు సోకే సర్వైకల్ క్యాన్సర్లలో 85 నుంచి 90 శాతం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్లే సోకుతోంది. ఎక్కువసార్లు ప్రసవాలు,

Telangana: Free HPV vaccine for 15-year-old girls
Telangana: Free HPV vaccine for 15-year-old girls

వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, చిన్న వయసులోనే పెళ్లి కావడం, లైంగిక సంబంధాల వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకుతుంది. అయితే ఇది సోకిన వెంటనే క్యాన్సర్ రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత మహిళల్లో క్యాన్సర్‌ బయటపడుతుంది. దీంతో అమ్మాయిలు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత, లైంగిక జీవితాన్ని ప్రారంభించడానికి ముందు హెచ్‌పీవీ టీకాలు వేయిస్తే.. క్యాన్సర్‌ను అరికట్టడంలో మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870