సొసైటీ కార్యాలయం ముందు తెల్లవారుజామున ఘటన జూలూరుపాడు: (Julurpadu) యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు సొసైటీ కార్యాలయం ముందు వారికి నిరీక్షణ తప్పడం లేదు. రైతులు టోకెన్ల కోసం తెల్లవారుజాము సమయానికే సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో సొసైటీ కార్యాలయం వద్దకు రైతులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. సొసైటీ కార్యాలయం వద్దకు ముందుగా వచ్చి క్యూ లైన్ లో ఉండేందుకు పలు గ్రామాల (Village) నుంచి రైతులు రావడంతో ఆందోళనకు దారి తీసింది. (Telangana) సొసైటీ కార్యాలయం ముందు గేటుకు తాళం వేసి ఉండగా కొందరు రైతులు గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారు.

జూలూరుపాడు
రైతులందరికీ సరిపడా అందడం లేదు
దీంతో తోపులాటతో పాటు రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది. సొసైటీ కార్యాలయానికి రోజుకు కేవలం నాలుగు టన్నులు మాత్రమే యూరియా (Urea) కేటాయింపు జరుగుతుండటంతో రైతులందరికీ సరిపడా అందడం లేదు. (Telangana) ఒక్కోరోజు అసలు సొసైటీ కార్యాలయంలో యూరియా నిల్వ కూడా ఉండడం లేదు. దీనిని గ్రహించిన రైతులు ఎవరికి వారే యూరియా కోసం క్యూ లైన్ లో ముందు ఉండాలని పోటీ పడుతున్నారు. క్యూలైన్ల వద్ద ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సొసైటీ కార్యాలయం (Society Office) వద్దకు చేరుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించి ఘర్షణ వాతావరణాన్ని శాంతింప చేశారు.
జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ఎప్పుడు ఎక్కువగా చేరుకుంటున్నారు?
రైతులు తెల్లవారుజామునే, ముఖ్యంగా ఉదయం 5 గంటల సమయానికి ఎక్కువగా చేరుకుంటున్నారు.
సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ఎందుకు ఆందోళనకు దిగారు?
యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో, అందరికీ సరిపోక రైతులు ముందుగా టోకెన్ పొందేందుకు పోటీ పడి ఘర్షణకు దారితీశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: