తెలంగాణ(Telangana)లో జరిగిన తొలి విడత పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మొత్తం 4,236 స్థానాల్లో ఇప్పటివరకు 746 ఫలితాలు ప్రకటించగా, కాంగ్రెస్ 472 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్(BRS) 142 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 27 స్థానాలను గెలుచుకోగా, స్వతంత్రులు మరియు ఇతర పార్టీలు 106 స్థానాలను దక్కించుకున్నారు.
Read also: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు షాక్.. నోటీసులు జారీ

ఉత్కంఠ రేపిన పంచాయతీ ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3,834 గ్రామాల్లో సర్పంచ్ మరియు 27,678 వార్డు మెంబర్ పోస్టులకు ఓటింగ్ జరిగింది. మొత్తం పోలింగ్ శాతం 79.15గా నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 87.93% పోలింగ్ జరిగింది. మెదక్ జిల్లాలో 86%, వరంగల్ జిల్లాలో 81.2% ఓటింగ్ నమోదైంది.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ అభ్యర్థి స్రవంతి కేవలం 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ పేరు మీదుగా 5 ఓట్ల తేడాతో విజయం దక్కింది.
మహబూబాబాద్ జిల్లా చీన్యా తండాలో BRS అభ్యర్థి హరిచంద్ 9 ఓట్ల తేడాతో గెలిచాడు. నల్గొండ జిల్లా తూర్పు తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న ఒక్క ఓటుతో విజయం సాధించడం విశేషం. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లి-కూతురు పోరు చర్చనీయాంశం కాగా, కాంగ్రెస్ అభ్యర్థి పల్లపు సుమలత తన తల్లి గంగవ్వపై 91 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: