हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

sirpur maoists arrest : సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

Sai Kiran
sirpur  maoists arrest : సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

sirpur maoists arrest : దేశవ్యాప్తంగా మావోయిస్టులపై భద్రతా బలగాల దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 16 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసు నిఘా విభాగం నుంచి అందిన పక్కా సమాచారంతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా 9 మంది మహిళలు, 7 మంది పురుషులు కలిపి 16 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర స్థాయి కేడర్ కలిగిన బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల చలనం తగ్గిందని భావిస్తున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టులు జరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఇదిలా ఉండగా, సుమారు 30 ఏళ్ల క్రితం (sirpur maoists arrest) అజ్ఞాతంలోకి వెళ్లిన తన కుమారుడు పోలీసులకు చిక్కాడన్న వార్త తెలిసి దామోదర్ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన కుమారుడిని ప్రాణాలతో చూస్తానో లేదో అనే ఆందోళన ఎప్పుడూ ఉండేదని, పోలీసులకు దొరికాడన్న వార్త ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తన కుమారుడిని తనకు అప్పగించాలని ఆమె పోలీసులను వేడుకున్నారు.

మరోవైపు, పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. అరెస్టయిన వారిని చట్టబద్ధంగా కోర్టులో ప్రవేశపెట్టాలని, వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870