తెలంగాణ సర్కార్ సింగరేణి కార్మికుల (Singareni workers) కు ఈ దసరా ఉత్సవాల సందర్భంలో గుడ్న్యూస్ను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయ ప్రకారం, సింగరేణి మైనర్లకు ఈ ఏడాది బోనస్గా మొత్తం లాభాల్లో 34 శాతం కేటాయించబోతున్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 2,360 కోట్ల రూపాయల లాభం వచ్చిన విషయం తెలిసిందే. దీని 34 శాతాన్ని బోనస్గా విరమిస్తూ సుమారు రూ.819 కోట్లు మైనర్లకు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ బోనస్ మొత్తం సింగరేణి ఉద్యోగుల ఆర్థిక స్థితిని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా వస్తోంది. ఒక్కో కార్మికుడికి దాదాపు రూ.1,95,610 విలువైన బోనస్ అందుతుందని సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థిక ప్రోత్సాహం మాత్రమే కాకుండా, వారి కృషి, నిబద్ధతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చేసిన ప్రత్యేక ఆహ్వానమని చెప్పారు.
సింగరేణి సంస్థను కార్పొరేట్ కంపెనీలతో
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రేవంత్ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ.5000 వేలు బోనస్ కింద ఇవ్వగా.. ఈ సారి మరో రూ.500 పెంచింది. ఈ ఏడాది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ కింద ఇవ్వనున్నారు. దేశచరిత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు (contract employees) సైతం బోనస్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

సింగరేణి కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. సింగరేణి సంస్థను కార్పొరేట్ కంపెనీ (corporate company) లతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం సంస్థ మొత్తం ఆదాయం రూ. 6,394 కోట్లు కాగా.. ఇందులో నుంచి రూ. 4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడుల కోసం కేటాయించినట్లు వివరించారు.
భవిష్యత్తులో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం
సింగరేణికి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన గనులను తిరిగి సంస్థకు అప్పగించాలని కార్మికులు చేసిన విజ్ఞప్తిని సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని తిరిగి లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
కాగా, గతేడాది అంటే.. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. అందులో 33 శాతం బోనస్గా ప్రకటించారు. మెుత్తం రూ.796 కోట్ల లాభాలు కార్మికుల వాటా కింద బోనస్గా చెల్లించారు. సగటున ఒక్కొక్క కార్మికుడి అకౌంట్లో బోనస్ కింద సుమారుగా రూ.1.90 లక్షల చొప్పున జమ చేశారు. ఈసారి అదనంగా మరో రూ.5610 బోనస్ కింద కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: