సిద్దిపేట (siddipet) జిల్లాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో కొత్త పెళ్లి అయిన ప్రణతి(24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సాయికుమార్కు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Read also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు

Newlywed dies in Siddipet road accident
చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్
మీరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్, ప్రణతి ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఉద్యోగ పనుల నిమిత్తం ఇద్దరూ హైదరాబాద్కు బైక్పై బయలుదేరగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి వారి బైక్ను ఢీకొట్టినట్లు తెలిసింది.
వివాహం అయినా కొద్ది రోజుల్లోనే ఇలా జరిగిన దుర్ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతులపై గోరింటాకు రంగు పూర్తిగా తొలగకముందే, కాళ్ల పారాణి ఆరిపోకముందే ప్రణతి మరణించడంతో బంధువులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. చెప్యాల గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: