తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. తాజాగా మాజీ సీఎస్ శాంతికుమారి, సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ విభాగ ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావుల నుంచి సిట్ విచారణ జరిపి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ దర్యాప్తులో ఇప్పటి వరకూ అధికారుల నుంచి ఈ స్థాయిలో సమాచారం తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో ట్యాపింగ్ కేసు కొత్త కోణాల్లో వెలుగులోకి వచ్చే అవకాశాలు నెలకొన్నాయి.

ముఖ్యాంశాలు:
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిబంధనల ప్రకారం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) కింద ఎవరి ఫోన్నైనా ట్యాప్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి అధికారిక అనుమతి తప్పనిసరి. దీంతో పాటు, కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబర్ల జాబితాను ముందుగా ఒక రివ్యూ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్యలు:
విశ్వసనీయ సమాచారం ప్రకారం, త అసెంబ్లీ ఎన్నికల నాటి సమయంలో, రాష్ట్ర SIB (Special Intelligence Bureau) చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం సుమారు 618 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయడానికి జాబితా తయారుచేసి, దాన్ని రివ్యూ కమిటీకి పంపింది. ఈ కమిటీ ఆమోదించిన తర్వాతే, అప్పట్లో సీఎస్గా ఉన్న శాంతి కుమారి, ఆ జాబితాను టెలికాం అనుమతుల కోసం డాట్ (DoT) కు ఫార్వార్డ్ చేసినట్టు పంపారని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read also: Hyderabad: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి