తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్(Second Phase Polling) విజయవంతంగా ముగిసింది. పోలింగ్ సమయంలో ఎలాంటి పెద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగగా, ఆ సమయంలో క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.
Read Also: TG Elections :పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఈ రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ మండలాల్లో ఉన్న 3,911 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ముందుగానే 415 గ్రామ పంచాయతీ సర్పంచ్(Second Phase Polling) స్థానాలు ఏకగ్రీవంగా ఖరారైన సంగతి తెలిసిందే. పోలింగ్ పూర్తైన వెంటనే ఓట్లను సురక్షితంగా స్ట్రాంగ్రూమ్లకు తరలించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామస్థాయి పాలనలో కీలకమైన ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్కు సంబంధించిన తాజా అప్డేట్స్ను వే2న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: