తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల( Sarpanch Elections) ప్రక్రియ నేటితో ముగియనుంది. తొలి రెండు దశలు విజయవంతంగా పూర్తవ్వగా, చివరిదైన మూడో దశ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ దశలో మొత్తం 53,06,395 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు, 140 మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్ కోసం 36,452 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 43,856 బ్యాలెట్ బాక్సులు(Ballot boxes) సిద్ధం చేశారు.
Read Also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్కు సర్వం సిద్ధం

3,752 సర్పంచ్ పదవులకు పోటీ
మూడో దశలో 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు( Sarpanch Elections) నోటిఫికేషన్ జారీ అయింది. ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు కానివి, కోర్టు స్టేలు వంటి కారణాలతో మిగిలిన 3,752 సర్పంచ్ పదవులకు ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్నికల నిర్వహణకు భారీ ఏర్పాట్లు
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 4,502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఇప్పటివరకు 36,165 మందిని బైండోవర్ చేయగా,
- రూ. 2.09 కోట్ల నగదు
- రూ. 3.81 కోట్ల విలువైన మద్యం
- రూ. 2.28 కోట్ల మత్తుపదార్థాలు
స్వాధీనం చేసుకున్నారు.
తొలి రెండు దశల్లో కాంగ్రెస్ ఆధిపత్యం
ఇప్పటికే జరిగిన తొలి రెండు దశల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ గ్రామాల్లో సర్పంచ్లుగా విజయం సాధించారు.
- తొలి దశలో కాంగ్రెస్ మద్దతుతో 2,872 మంది, బీఆర్ఎస్ 1,160, బీజేపీ 195 స్థానాల్లో గెలిచాయి.
- రెండో దశలో కాంగ్రెస్ మద్దతుదారులు 2,316, బీఆర్ఎస్ 1,157, బీజేపీ 256, ఇతరులు 481 చోట్ల విజయం సాధించారు.
లాస్ట్ పంచ్ ఎవరిది?
మూడో దశ పోలింగ్ నేడు జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. తొలి రెండు దశల్లో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ చివరి దశలోనూ అదే జోరు కొనసాగిస్తుందా? లేక ప్రత్యర్థులు చివరి అవకాశాన్ని ఉపయోగించుకుంటారా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: