తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్కు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది. ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో టీఎస్ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఆర్థిక పునరుద్ధరణకు కీలకంగా సజ్జనార్ సేవలు
వీసీ సజ్జనార్ (VC Sajjanar) 2021లో టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను ఆర్థికంగా పునరుద్ధరించేందుకు అనేక కీలక చర్యలు తీసుకున్నారు. సంస్థ ఆదాయ వనరులు పెంచడం, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడం, ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో ఆయన విస్తృతంగా పని చేశారు. ఆయన నాయకత్వంలో ఆర్టీసీ తన స్థిరతను మరింత బలోపేతం చేసుకుంది.
సెలవుల నిర్ణయం చర్చనీయాంశం
సజ్జనార్ ఇలా అకస్మాత్తుగా నెల రోజుల సెలవుపై వెళ్లడం ఇప్పుడు అధికార వర్గాల్లో మరియు టీఎస్ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల తీసుకున్న నిర్ణయమేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సజ్జనార్ తిరిగి పదవిలో చేరే వరకు సురేంద్ర మోహన్ ఆర్టీసీ విధులను నిర్వర్తించనున్నారు.
Read Also : Lashkar Bonalu : రేపే లష్కర్ బోనాలు.. పాల్గొననున్న సీఎం రేవంత్