हिन्दी | Epaper

Revanth Reddy : భద్రాచలంలో సీతారాముల కల్యాణం… పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి

Divya Vani M
Revanth Reddy : భద్రాచలంలో సీతారాముల కల్యాణం… పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానంలో జరిగే కళ్యాణ మహోత్సవం ఈ ఏడాది కూడా అద్భుతంగా జరిగింది.వేలాది మంది భక్తుల సాక్షిగా సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం రామనామంతో మారుమోగిపోయింది.దేవతల పెళ్లినే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి భక్తులందరికీ కలిగింది.ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందించారు.మిథిలా మైదానంలో వేడుక ప్రత్యేకంగా నిర్వహించబడింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో మాంగల్యాన్ని ధరిచాడు.ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ కార్యక్రమం మొదలవగా, పదికి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకొచ్చారు.

Revanth Reddy భద్రాచలంలో సీతారాముల కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy భద్రాచలంలో సీతారాముల కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి

మూడు నెలల క్రితమే తయారు చేసిన తలంబ్రాలను పూజారులు వినియోగించారు.మంగళసూత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇందులో మూడు పోగులు ఉండగా, ఒకటి సీతమ్మ పుట్టింటి వారు, మరొకటి అత్తవారిది, మూడవది భక్త రామదాసు తయారు చేయించారంటే ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు.మూడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ అదే భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది.12.02 నిమిషాలకు జీలకర్ర బెల్లం వేయడం జరిగింది. అనంతరం మాంగల్యధారణ కన్నుల పండువగా సాగింది. కళ్యాణం 12.40కి ముగిసింది. భక్తుల చీలికలతో రామనామం ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించింది.వేసవి వేడి ఉండగానే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Revanth Reddy భద్రాచలంలో సీతారాముల కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy భద్రాచలంలో సీతారాముల కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి

అన్నదానం, నీరు, వైద్యం వంటి ఏర్పాట్లతో ఆలయ అధికారులు సాఫీగా నిర్వహించారు. భద్రత కోసం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఈ వేడుకలో టీటీడీ తరపున కూడా పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా ఉంది. ఈసారి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈవో రమాదేవి సమక్షంలో వారిని ఆలయ సంప్రదాయాలతో స్వాగతించారు.చివరగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సీతారాముల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సంతోషం కలగాలి” అంటూ ఆకాంక్షించారు. దేవస్థాన అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

READ MORE : PM Modi: పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించిన మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

డాక్టర్ నమ్రత కుటుంబం రూ. 50 కోట్ల ఆస్తులు జప్తు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు

📢 For Advertisement Booking: 98481 12870