తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఊపిరితిత్తుల్లా ఉన్న మూసీ నదీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ముమ్మరం చేశారు ముస్సాయి ప్రక్షాళనను ఇక వాయిదా వేయొద్దని, దాని పునరుజ్జీవమే తెలంగాణ అభివృద్ధికి కీలకమని చెప్పారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు రీజినల్ రింగ్ రోడ్ పూర్తయ్యేలోపు మూసీ శుద్ధికరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే అవసరమైన ఏర్పాట్లు ఉండాలని, పనుల పురోగతిపై వేగం పెంచాలని సూచించారు.ఇప్పటివరకు ఎంత పని పూర్తయింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అన్నదానిపై సీఎం అధికారులను నేరుగా ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పురాతన మూసీ నదిని తిరిగి జీవితం చేకూర్చే ప్రయత్నమే కాకుండా, రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కనెక్టివిటీ మెరుగుపడితే అభివృద్ధి వేగం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టును స్టేజ్వారిగా విభజించి వేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. మూసీ చుట్టూ ఉన్న పల్లెలకు మంచినీటి వసతి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలన్నది ఆయన లక్ష్యం. ప్రజల ఆరోగ్యం నగర భద్రత కోసం ఈ ప్రాజెక్ట్ అనివార్యమని చెప్పారు.హైదరాబాద్ శుభ్రతకు మూసీ శుద్ధికరణ ఓ పెద్ద అడుగు అవుతుంది. ఇది పూర్తి అయితే నగరం మరో మెట్టుకు చేరుతుంది. ముఖ్యమంత్రి దీన్ని ఓ ప్రాధాన్యమైన లక్ష్యంగా తీసుకున్నారు.సమయాన్ని వృథా చేయకూడదని సీఎం స్పష్టం చేశారు. అనవసర ఆలస్యం జరుగకుండా అధికారులు సమయానికి పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రజలకు దీని లాభాలు త్వరగా కనిపించాలన్నదే ఆయన ఉద్దేశం.