News Telugu: Revanth reddy: హిల్ట్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకూడదు: బీజేపీ ఫిర్యాదు

Read Time:  1 min
Illegalities should not be allowed in the name of Hilt Policy
Illegalities should not be allowed in the name of Hilt Policy
FONT SIZE
GET APP

Revanth reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిల్ట్ (Hyderabad Industrial Lands Transformation – HILT) పాలసీపై రాష్ట్ర బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. భూకుంభకోణం జరుగుతున్నట్లు, వేల కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమ మార్గంలో జరుగుతున్నట్లు బీజేపీ (BJP) నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన పార్టీ ప్రతినిధుల బృందం వివరణ ఇచ్చింది.

Read also: Harisg Rao: రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్..

Illegalities should not be allowed in the name of Hilt Policy

Illegalities should not be allowed

ఈ నెల 7న ఇందిరాపార్క్‌లో

Revanth reddy: హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ పారిశ్రామిక భూభాగాలను బహుళ వినియోగ జోన్లుగా మార్చాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, దీనితో కొందరు భూఅక్రమాలకు పాల్పడే అవకాశాలను సృష్టిస్తున్నారని బీజేపీ నేతలు గవర్నర్‌కు తెలిపారు. రామచందర్ రావు, శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భూముల ధరలు, గతంలోకన్నా ఇప్పుడు ఎంత పలికాయో పరిశీలిస్తే అక్రమాల సంకేతాలు స్పష్టమని వారు పేర్కొన్నారు.

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ప్రభుత్వ విధానాలపై నిరసనగా ఈ నెల 7న ఇందిరాపార్క్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీ విస్తరణకు పాలసీ మార్గంలో ప్రణాళికలు రూపొందిస్తోందని, దీనిలోనూ కొన్ని కుట్రలు దాగి ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.