Revanth Reddy: బీఆర్ఎస్ ఇప్పుడు చరిత్రలో కలిసిపోతున్న పార్టీగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఉన్న “వ్యాలిడిటీ పీరియడ్” ముగిసిపోయిందని, కేసీఆర్తోనే దాని రాజకీయ ప్రస్థానం కూడా ముగుస్తుందని స్పష్టం చేశారు. తాను రాజకీయ ప్రతిస్పందన కోణంలో కాకుండా వాస్తవ పరిస్థితులను చెప్పుతున్నానని ఆయన అన్నారు. ఒకప్పుడు ప్రభావం చూపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుమరుగైనట్లే, బీఆర్ఎస్ కూడా అదే దారిలో వెళ్తుందని ఆయన అంచనా వేశారు. కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డారని, ఆయనను చూస్తే సానుభూతి కలుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా కేసీఆర్ ఒక్క మాట కూడా చెప్పకపోవడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలన్నారు.
Read also: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

Revanth Reddy: కేసీఆర్కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం
బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ 8 సీట్లు గెలిచింది
Revanth Reddy: ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందని రేవంత్ ఆరోపించారు. “ఆ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ 8 సీట్లు గెలిచింది” అని అన్నారు. కవిత స్వయంగా బీజేపీతో విలీన ప్రక్రియ మొదలైందని చెప్పడం దీనికి సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి పునాది పడిందని రేవంత్ గుర్తుచేశారు. గోదావరి నీటిని హైదరాబాద్కు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఐటీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధికి కూడా అదే బాట వేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో సంక్షేమం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: