మల్కాజ్గిరి(Malkajgiri) జిల్లా జవహర్నగర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య(Murder)కు గురయ్యారు. సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి, బండ రాయితో మోది, ఆపై కాల్చి నడిరోడ్డుపై అతడిని దారుణంగా హత్య చేశారు. ఘంటా వెంకటరత్నం (46) స్థిరాస్తి వ్యాపారి. పిల్లలను పాఠశాలలో దింపి ఇంటికి వెళ్తుండగా దుండగులు అతడి ద్విచక్ర వాహనాన్ని వెంబడించారు. కత్తులతో దాడి చేసి నరికి, ఆపై తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
Read Also: Kavitha: కూకట్పల్లికి కనీస వసతులు లేవు: కవిత కామెంట్స్

ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య?
ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని, అతని ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. గతంలో ఓ జంట హత్యల కేసులో ఘంటా వెంకటరత్నం నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై ధూల్పేటలో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. ఘంటా వెంకటరత్నం హత్య విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
హత్యకు సంబంధించి మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మాట్లాడారు. వెంకటరత్నం (46) అనే వ్యక్తిని హత్య చేసినట్టు సమాచారం రావడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలతో కలిసి విచారిస్తున్నామని, మృతుడిని కత్తులతో తల, మెడ, కడుపు, వీపుపై దారుణంగా నరికి, బండరాయితో మోది, ఆపై కాల్పులు జరిపి చంపారని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: