हिन्दी | Epaper

Ramagundam NTPC: రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

Saritha
Ramagundam NTPC: రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రెండో దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85శాతం తెలంగాణకే

Ramagundam NTPC: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా రామగుండం ఎన్టీపిసి రెండో దశ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రామగుండంలో ఎన్టిపిసి ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటిదశలో భాగంగా దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2౧800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2023లో ప్రారంభించి జాతికి అంకితం చేశారన్నారు.

అనంతరం రెండవ దశలో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపిసి చర్యలు చేపట్టిందని వివరించారు. మొదటిదశలో మాదిరిగానే రెండవ దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85 శాతం విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందన్నారు. ప్రస్తుతం సంవత్సరం మార్చి, 3న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందన్నారు.

Read Also: Police Unemployment JAC: తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

Ramagundam NTPC: రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్
Ramagundam NTPC: Hugely increasing electricity demand in the state

బొగ్గు సమీకరణకు ఎన్టిపిసికి తగిన స్వేచ్ఛ ఇవ్వండి

రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందని తెలిపారు. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని, అందులో భాగంగా ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విద్యుత్ రంగం మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో 5000 నుంచి 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని తెలిపారు.

పూర్తి 5,800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీక రించుకోవడంలో ఎన్ఐపిసికి తగిన స్వేచ్చను ఇచ్చినట్లయితే, థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్టీపిసి సిద్ధంగా ఉందన్నారు. మీరు వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఎన్టిపిసికి రెండవ దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3,800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పిపిఏ) చేసుకునేలా కృషి చేయాలని సిఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

📢 For Advertisement Booking: 98481 12870