ఇటీవల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) విమర్శిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ (Revanth Reddy) చెప్పడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాలతోనే ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్లో ప్రజాస్వామ్య బద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.

తన రాజకీయ ప్రయాణం ఆగదు
తన రాజకీయ ప్రయాణం (political journey) ఇక్కడితో ఆగదని, కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని పేర్కొన్నారు. అదే మార్గాన్ని తాను ఎంచుకున్నట్లు తెలిపారు. అంతేకాదు రాజకీయాలు అంటే తనకు పదవులు, అధికారాలు కాదని, ప్రజల పట్ల నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తనకున్న కలలే ప్రేరణగా నిలిచాయని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్లో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. సీనియర్ నాయకులు, సీఎంల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ తరుణంలో రేవంత్రెడ్డి 2024 నుంచి 2034వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటడు అన్నవ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో హాటాపిక్గా మారింది. సీఎం ఎవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అని పలువురు నేతలు అంతర్గతంగా విమర్శిస్తున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద