తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ (BJP) కి ఊహించని షాక్ తగిలింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) బీజేపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికల వేళ వచ్చిన ఈ పరిణామం, పార్టీలో నెలకొన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను, అసంతృప్తిని బయటపెడుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన తన మద్దతు దారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. ముందుగానే నిర్ణయించి అధ్యక్షుడిని ప్రకటించారని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి పైన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన రాజీనామా లేఖ సమర్పిస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా ఆమోదించాలని కోరినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గా రాజీనామా పైన స్పీకర్ కు లేఖ పంపాలని కోరారు.

రాజీనామా కారణాలు – లోపలి కలహాలే కారణమా?
రాష్ట్ర బీజేపీలో పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ నడిచిన పరిణామాలు తాను కొన్నేళ్లుగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని చెప్పారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారికి ప్రాధాన్యత దక్కుతుందని ఆరోపించారు. కాగా రాజాసింగ్ కొంత కాలంగా పార్టీలో జరిగే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ముఖ్య నేతలు లక్ష్యంగా వ్యాఖ్యలు చేసారు.
కొన్ని సంవత్సరాలుగా అసంతృప్తి
రాజాసింగ్ గత కొంత కాలంగా పార్టీ నేతల తీసుకునే నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అవకాశం ఇవ్వకపోటం పైన ఆయన ఆగ్రహం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రాజాసింగ్ కొంత కాలంగా పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది.
పార్టీ అధ్యక్ష పదవిపై నిరసన
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఖరారు చేసిన విధానం పట్ల రాజాసింగ్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తన సీనియార్టీ పట్టించుకోవటం లేదనే ఆవేదనతో రాజాసింగ్ ఉన్నట్లు గా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు రాజాసింగ్ పార్టీ నేతల పూన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను బీజేపీకి రాజీనామా చేసానని చెబుతున్న రాజాసిం్ హిందుత్వం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. తాను, తన కుటుంబం టెర్రరిస్టు ముప్పుతో ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా పై పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి పట్ల హర్షం
సీఎం రేవంత్ ను అభినందిస్తూ పలు సందర్భాల్లో రాజాసింగ్ మాట్లాడటం పార్టీ నేతలకు రుచించటం లేదు. ప్రతిపక్షంగా ఉన్నా మంచి నిర్ణయాలకు అభినందన ఇవ్వడం తప్పుకాదనే స్థాయిలో ఆయన మాటలు వస్తున్నప్పటికీ, ఇది బీజేపీ లోపల వారిని బాధించింది.
Read also: Etela Rajender: పేదల ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడంతో మండిపడ్డ ఈటల