हिन्दी | Epaper

బండి సంజయ్‌కి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

Sudheer
బండి సంజయ్‌కి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇండ్ల పథకంపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ..బండి సంజయ్‌పై తీవ్రంగా స్పందించారు.

ponnam bandi
ponnam bandi

ఇందిరాగాంధీపై విమర్శలు చేయడం అనుచితం అని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా గతంలో ఇందిరాగాంధీని కాళీమాతతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. కేంద్రం పథకాల పేర్లు తమ నేతల పేర్లతో ఉంటే సరేనా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను నిర్లక్ష్యం చేస్తూ వ్యాఖ్యలు చేయడం సహించేది లేదని బండి సంజయ్‌ను హెచ్చరించారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి జీఎస్టీ రూపంలో రూ.37,000 కోట్ల ఆదాయం వచ్చినా రాష్ట్రానికి తగిన నిధులు అందించడం లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రతినిధులు రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు. రాష్ట్ర పథకాలపై విమర్శల బదులు కేంద్రం ఇచ్చిన సహాయంపై సమాధానం చెప్పాలని బండి సంజయ్‌ను నిలదీశారు.

ముందురోజు బహిరంగ సభలో బండి సంజయ్ తనకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించినా, తరువాత రోజు వీరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం గమనార్హం. మేయర్ సునీల్ రావును బీజేపీలో చేర్చుకోవడం వంటి పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న నాయకులు విమర్శలు చేసుకోవడం, మరుసటి రోజే కౌగిలింతలు పడటం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు

ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

ఆ కేసులో జక్కుల లక్ష్మణ్ ఏమన్నారంటే?

ఆ కేసులో జక్కుల లక్ష్మణ్ ఏమన్నారంటే?

ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది

ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

📢 For Advertisement Booking: 98481 12870