హైదరాబాద్ Politics : త్వరలో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential election) ఊహించని ఫలితాలు ఉంటాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. తెలుగు ఎంపిలంతా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని విజప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎంపి మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేఖరులతో మాట్లాడారు. తెలుగు ఎంపిలు కృషి చేయాలని కోరారు. సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీలో సభ్యత్వం లేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన గెలుపు కోసం తెలుగు ఎంపిలంతా కృషి చేయాలి. సుదర్శన్ రెడ్డి త్వరలోనే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను, ఎంపిలను కోరతారు. ఈ ఎన్నికల్లో విప్ ఉండదు. కాబట్టి ఎంపీలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం వినియోగించు కుంటారని ఆశిస్తున్నామని అని మల్లు వివరించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి త్వరలో ఉత్త రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తారు.
సుదర్శన్ రెడ్డికి అన్ని పార్టీల మద్దతు కావాలి, కేంద్రంపై తెలంగాణ ఎంపీల లేఖలు

యూపీలో అఖిలేష్ యాదవ్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ మద్దతు కోరతారు. అలాగే ఇండియా కూటమి ఎంపీల మద్దతు కోరతారు. తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ నేను కూడా సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) గెలుపు కోసం ఎంపీల మద్దతు కోరతానని మల్లు రవి స్పష్టం చేశారు. చంద్రబాబు కృతజ్ఞత చూపాలి: ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టులోన్యాయ మూర్తిగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు కృతజుత చూపాల్సిన సమయం వచ్చిందని రవి వ్యాఖ్యానించారు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మేము అన్ని పార్టీలను, ఎంపీలను విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కీలక తీర్పులను చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోణం లో ఆలోచించే వ్యక్తి అని మల్లు రవి వ్యాఖ్యానించారు. తెలుగు కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తామని తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను నిర్వహించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు ప్లాన్ ప్రకారం సభల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించారని మల్లు రవి ఆరోపించారు. అలాగే తెలంగాణ ఎంపీలంతా కలిసి కీలక అంశాలపై కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాసినట్టు వివరించారు మల్లు రవి. విభజన సమస్యల పరిష్కారం, సెమీకండక్టర్ యూనిట్స్, తెలంగాణలో ఎయిర్ పోర్టులు, మూసీనదీ ప్రక్షాళన వంటి అంశాలపై సంబంధిత మంత్రులకు లేఖలు రాసినట్టు వెల్లడించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :